UPDATES  

 మీరు రావాలి..

మీరు రావాలి..
* తుమ్మలను కలిసిన పొంగులేటి
* కాంగ్రెస్ గూటికి రావాలని ఆహ్వానం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
మాజీ మంత్రి డైనమిక్ లీడర్ సీనియర్ రాజకీయ నాయకులు తుమ్మల నాగేశ్వరరావును ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కలిశారు. శనివారం తుమ్మల ఇంటికి పొంగులేటి వెళ్లడం జరిగింది. సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ ఆత్మీయంగా హత్తుకుని ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ తుమ్మల ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తారని ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు. ఇప్పటికే తుమ్మలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారని తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. గులాబీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకులను కెసిఆర్ విస్మరించడం దారుణం అన్నారు. బిఆర్ఎస్ లో పొమ్మనకుండా పొగపెడతారని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ తనకు చేసిన విధంగానే తుమ్మలను కూడా అవమానాలకు గురి చేసిందని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను వీడిన తర్వాత కాంగ్రెస పార్టీలో చేరే ముందు తాను తన అనుచరులు, మద్దతుదారులతో చర్చించానని వారందరి సూచనల మేరకే కాంగ్రెస్ లో చేరానని పొంగులేటి చెప్పారు. తుమ్మల కూడా వారి అనుచరులతో మాట్లాడి ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు.
కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటా…
ఏ పార్టీలో చేరాలన్నది అభిమానులు కార్యకర్తల అభిప్రాయాల మేరకు తన నిర్ణయం ఉంటుందని మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
తనకు ఏ అవకాశం వచ్చిన జిల్లా అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు.
సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసమే తాను రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ లోకి‌ తనను ఆహ్వానించడానికి వచ్చిన మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆయన అనుచరులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తుమ్మల పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !