మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- ఈ నెల 9వ తేదీన భద్రాచలం కోర్టులో లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడే కేసులలో రాజీ పడవచ్చు అని బూర్గంపాడు ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అతి తక్కువగా రూ500 లోపు ఫైన్ వేయబడుతుందనీ.సెప్టెంబర్ 1వ తేది నుండి 9వ తేది వరకు ఏ రోజైనా మీరు కోర్టులలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల రాజీపడదగిన క్రిమినల్ కేసులు,చెక్కు బౌన్స్ కేసులు,మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు,లేబర్ కేసులు,సివిల్ కేసులు,కోర్టుల వరకు వెళ్లని రాజీపడదగిన ముందస్తు తగాదాలు ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు అని ఎస్ఐ రాజకుమార్ ఒక ప్రకటనలో కోరారు.





