నేటి సమాజంలో మీడియా పాత్ర కీలకం
*ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.
*ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, ఐటీడీఏ పీవో అంకిత్.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
నేటి సమాజంలో మీడియా పాత్ర కీలకమని జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి ఐటీడీఏ పీవో అంకిత్ లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఏటూరు నాగారం ప్రెస్ క్లబ్ నూతన భవన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి బడే నాగజ్యోతి ఐటీడీఏ పీవో అంకిత్ హాజరై భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.ప్రజలకు ప్రభుత్వానికి సమాచారం చేరవేయడంలో మీడియా పాత్ర కీలకం గా ఉంటుందని, సకాలంలో సమాచారం ఇవ్వడం వల్ల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అలాగే ఐటీడీఏ పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని,రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.గృహ లక్ష్మి పథకం కింద అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సంధ్యారాణి,సీఐ మండల రాజు,ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్ల బుచ్చయ్య,జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ,ఎంపీపీ అంతటి విజయ,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిటమట రఘు, బిజెపి మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, బ్లాక్ కార్యదర్శి వావిలాల నరసింహారావు,కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఎండి సులేమాన్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎండి అయుబ్ ఖాన్,గుండ్ల దేవేందర్,
బిఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆఫ్జల్ పాషా ప్రధాన కార్యదర్శి అలువాల శ్రీనివాస్,గౌరవ అధ్యక్షులు నూక ప్రభాకర్,గౌర సలహాదారులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు,వసంత రమేష్, బోడ సత్యం,పర్వతాల లాలయ్య,కుదురుపాక రాజేష్, గంపల శివకుమార్,చిదురాల వాసు,వసంత రమేష్,పోలె బోయిన గోపాల్,గుండెల శ్రీనివాస్,శేరి శ్రీనివాస్,అక్తర్ పాషా,లకుమయ్య,గౌరీ శంకర్, పెండ్యాల ప్రభాకర్,రవి,
రవికుమార్,సాయి,రాజు, ప్రతాప్,వరప్రసాద్,దామోదర్, చంద్రశేఖర్,గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.





