జర్నలిజం వృత్తి గౌరవప్రదమైంది
* కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, డి పి ఆర్ ఓ శీలం శ్రీనివాసరావు
* పలువురు జర్నలిస్టులకు సన్మానం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
జర్నలిజం వృత్తి ఎంతో గౌరవప్రదమైందని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, డి పి ఆర్ ఓ శీలం శ్రీనివాసరావులు అన్నారు. పాత్రికేయ రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా వెలికి తీసి రాయాలని, అప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని, పాత్రికేయ వృత్తి హుందాగా ఉండాలని సూచించారు. బుధవారం జర్నలిస్ట్ డే సందర్భంగా కొత్తగూడెం ప్రెస్ క్లబ్ లో పలువురు జర్నలిస్టులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి రెహమాన్, జిల్లా జిల్లా పౌర సంబంధాల అధికారి(డిపిఆర్ఓ)శీలం శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిజం కత్తి మీద స్వాము లాంటిది అన్నారు. నేడు సోషల్ మీడియా వలన జర్నలిజానికి నాణ్యత తగ్గిందని తెలిపారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు జర్నలిస్టుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని నిర్మూలించాల్సిన బాధ్యత మీదే ఉందన్నారు. జర్నలిజన్ని సమాజ హితం కోసం, శ్రేయస్సు కోసం ఉపయోగించాలని కోరారు. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టాలని, అప్పుడే పాత్రికేయులకు నిజమైన గౌరవం దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ వన్ టౌన్ సిఐ కరుణాకర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.