మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 7 ::
మండలంలోని దుమ్ముగూడెం గ్రామంలో గల పవిత్ర గోదావరి నది తీరాన కొలువై ఉన్న శ్రీ కాశీ గంగా భవాని అమ్మవారి జాతర మహోత్సవంను గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా అమ్మవారికి పాలాభిషేకం,కుంకుమ పూజలు, అన్నదానం,ఊరేగింపు,అమ్మవారి తెప్పోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతర అధ్యక్షులు కరకు నరసింహారావు,గౌరవ అధ్యక్షులు మొసలి రాంబాబుతో పాటుగా గంగాపుత్ర సంఘం సభ్యులు,గ్రామ పెద్దలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.