UPDATES  

 పండుగలను సంతోషంగా జరుపుకోవాలి: డిఎస్పీ రెహమాన్

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
పండుగలను సంతోషంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ అన్నారు. కొత్తగూడెం ఐఎంఏ హాల్లో శనివారం
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ కొత్తగూడెం పట్టణంలోని మత పెద్దలందరితో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు. కొత్తగూడెం పట్టణ పరిసర ప్రాంతాలకు గణేష్ ఉత్సవ కమిటీలు ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం అందించి గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కులమతాలకు అతీతంగా పండుగలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పోలీసు వారు సూచించే నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని కోరారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మత పెద్దల వద్ద నుండి సలహాలు, సూచనలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సిఐ పెద్దన్న కుమార్,వన్ టౌన్ సిఐ కరుణాకర్,టూ టౌన్ సిఐ రమేష్,3 టౌన్ సిఐ మురళి మరియు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !