UPDATES  

 పండుగల నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలి

పండుగల నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలి

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి

డిఎస్పి రాఘవేంద్రరావు

మన్యం న్యూస్ మణుగూరు:

మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో మణుగూరు సిఐ వరప్రసాద్, పట్టణ పీస్ కమిటీ మీటింగ్ డిఎస్పి ఆఫీస్ లో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా డిఎస్పీ రాఘవేంద్రరావు మాట్లాడుతూ, రాబోయే వారం రోజుల్లో జరగే పండుగ గురించి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. మణుగూరు మండలం,పట్టణం మున్సిపాలిటీ పరిధిలో ప్రతిష్టించే వినాయకుల విగ్రహాల గురించి,దానికి సంబంధించిన నిమజ్జనాల గురించి,అదే విధంగా మీలాద్ ఉన్ నభి పండుగ సందర్భంగా దానికి సంబంధించిన ర్యాలీ గురించి,ఈ సమయాలలో చర్చి వాళ్ళు తీసుకోవాల్సిన నియమావళి గురించి ఈ పీస్ కమిటీ మీటింగ్లో చర్చించడం జరిగింది అన్నారు.ఎట్టి పరిస్థితుల్లో వినాయక నిమజ్జనం రోజు డిజే లకు అనుమతి లేదు అని,ఎవరు మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగే విధంగా ప్రవర్తించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకొవడం జరుగుతుంది అన్నారు.ప్రతి వినాయకుడిని ప్రతిష్టించే పీఠం వద్ద దానికి సంబంధించి ఎవరు ఉంటున్నారు.ఆ కమిటీ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరు, దానికి సంబంధించిన వివరాలు పోలీస్ స్టేషన్లో అందియాల్సి ఉంటుంది అని అన్నారు.అదే విధంగా వారు ఏ వాహనాన్ని వినియోగిస్తున్నారు.ఏరోజు నిమజ్జనం చేస్తున్నారు అనే విషయాలు కూడా ముందస్తు గానే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని పేర్కొన్నారు.ఎట్టి పరిస్థితుల్లో అందరూ మైకు పర్మిషన్,కరెంటు పర్మిషన్ సంబంధిత కర్యాలయాల నుండి తీసుకోవాలని అన్నారు. అదే విధంగా స్టేజీలు వేసే దగ్గర అన్నదాన కార్యక్రమాలు జరిగే దగ్గర మిగిలిన ప్రజలకు,కాలనీ వాసులకు,మిగతా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ కమిటీ వారు చూసుకోవాల్సి ఉంటుంది అన్నారు.మంచి వాతావరణంలో ప్రజలందరూ కలిసి,ఈ పండుగను కుటుంబ సభ్యులతో సంతోషకరంగా జరుపుకోవాలని,ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఈ పండుగ జరుపుకోవలని డీఎస్పీ రాఘవేంద్రరావు కోరారు.ప్రతి ఏరియాలో వినాయకుని ప్రతిష్టించే ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉండే విధంగా కమిటీ చూసుకోవాలని అని సూచించారు.ఈ కమిటీ మీటింగ్ లో మొత్తం మణుగూరు మున్సిపాలిటీ, మండలాల నుంచి 30 మంది అన్ని మతస్తుల వారు పాల్గొన్నారు.ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా కమిటీ వారు పూర్తి బాధ్యతలు తీసుకొని పండుగలను విజయవంతం చేసి,అందరూ సంతోషకరమైన వాతావరణంలో పండుగలను జరుపుకుంటామని వారు తెలిపారు.ఈ మీటింగ్ లో వరప్రసాద్,పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !