UPDATES  

 కెనరా బ్యాంకు విద్యా జ్యోతి అవార్డులు ప్రదానోత్సవం..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 13::
మండలంలోని నరసాపురం పాఠశాలలో కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా జ్యోతి పథకం అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ పథకం కింద గత సంవత్సరం 8, 9, 10 తరగతుల్లో ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణత సాధించిన జి. అనూష, బి. రాధిక, సమీరా సింహాన్ని, విద్యార్థులకు రూ5వేల నగదు , బహుమతిని బ్యాంకు మేనేజర్ బాలకృష్ణ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాంతారావు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరడానికి పోటీతత్వం కలిగి ఉండాలని కోరారు. ఇంద్ర భవనం లాంటి పాఠశాల నిర్మించి అందించిన భవన దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రామకృష్ణ, ఎస్ఎంసి చైర్మన్ విద్యాసాగర్, సూది రెడ్డి రమణారెడ్డి, బ్యాంక్ స్టాఫ్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !