మన్యం న్యూస్ బూర్గంపహాడ్: మండల పరిధిలోని సారపాక లోని లెనిన్ నగర్ శ్రీరాంపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విలేకరులమని చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను బూర్గంపాడు పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయురాలు వసుంధర, బూర్గంపాడు ఎస్ఐ నాగ బిక్షం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరబాబు, సత్యనారాయణ,జయబాబు లు తాము విలేకరులమంటూ ఫేక్ మీడియాఐడి కార్డులు చూపించి సారపాక లెనిన్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను డబ్బులు డిమాండ్ చేశారు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయురాలు వసుంధర పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. తప్పుడు ఐడి కార్డులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని నిర్ధారణ రావడంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బూర్గంపహాడ్ ఎస్ఐ నాగబిక్షం తెలిపారు.ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడితే ఎంతటి వారినైన ఉపేక్షించేది లేదు అని ఇలాంటి అపరిచిత వ్యక్తులు డబ్బుల వసూళ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని ఎస్సైకోరారు.