UPDATES  

 టెట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి * జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

15 తేదీన జరుగనున్న టెట్‌ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. టెట్ పరీక్ష నిర్వహణపై నిర్వహించనున్న టెట్ పరీక్ష నిర్వహణపై గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ సాధనలో టెట్ పరీక్ష చాలా ప్రదానమైందని చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచిఉండకుండా ముందస్తుగా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలో 37 కేంద్రాలలో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మొదటి పేపర్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో పేపర్ 2.30 నుంచి 5 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. మొదటి పేపర్ పరీక్షకు 37 కేంద్రాలు రెండో పేపర్ పరీక్ష 29 కేంద్రాలలో జరుగుతుందని చెప్పారు. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం మండలాల్లోని 37 కేంద్రాల్లో 8,717 మంది టెట్ పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. కొత్తగూడెంలో 16, పాల్వంచలో 6, మణుగూరులో 8, భద్రాచలంలో 7 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని చెప్పారు. పటిష్ట భద్రత మధ్య పరీక్ష నిర్వహణ ఉంటుందని అభ్యర్థులు ఏదేని అక్రమాలకు మాల్ ప్రాక్టీస్ లకు పాల్పడకుండా నిష్పక్షపాతంగా పరీక్ష వ్రాయాలని చెప్పారు. పరీక్ష హాలులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్ లకు అనుమతి లేదని చెప్పారు. విధులు కేటాయించిన సిబ్బంది ఉదయం 7 గంటలకు పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాలని చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !