UPDATES  

 పట్టణంలోని పలు విఘ్నేశ్వర మండపాలను దర్శించుకున్న హరిసింగ్ నాయక్

 

మన్యం న్యూస్,ఇల్లందు:గణేష్ మండప నిర్వాహక కమిటీ వారి ఆహ్వానం మేరకు పట్టణ పరిధిలోని 11వవార్డ్ వెంగళరావు కాలనీ,16వార్డ్ రాజేందర్ నగర్, 24వార్డ్, 3వార్డు జేబీఎస్ స్కూల్, సివిల్ లైన్, భజనమందిర్, కూరగాయల మార్కెట్, 2,17,13వ వార్డులలోని పలు వినాయక మండపాలను బీఆర్ఎస్ రాష్ట్రనేత బానోత్ హరిసింగ్ నాయక్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి ప్రత్యేకపూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అనంతరం హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలకు పూర్వవైభవం తెచ్చేందుకు అందరూ కలిసికట్టుగా వేడుకలు జరుపుకోవాలని కోరారు. వచ్చేఏడాది ప్రతిఒక్కరూ పట్టణంలో మట్టి వినాయకులను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. పట్టణ ప్రజలందరూ అన్ని రంగాలలో దినదిన అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండునూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జెకె శ్రీను, కోక్కు నాగేశ్వరావు, రజిత, పద్మ, తార, మాధవి, కటకం పద్మావతి, పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, ప్రధాన కార్యదర్శి పర్చూరు వెంకటేశ్వరరావు, పివి కృష్ణారావు, పెండ్యాల హరికృష్ణ, పర్రె శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కోక్కు సరిత, ఉపాధ్యక్షురాలు రాజూరి మంజుల, గుండ్రాతి చంద్రావతి, నాయకులు సామల రవితేజ, ఎస్సీసెల్ పట్టణ ఇంచార్జ్ మేకల శ్యామ్, పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, సనా రాజేష్, ఆదూరి రవి, నెమలి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !