కేసీఆర్ పాలనలో పల్లెలు అభివృద్ధి
*రూ.2కోట్ల 28లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా.
మన్యం న్యూస్.ములకలపల్లి. సెప్టెంబర్.25. మండలంలో ని పలు గ్రామాలో సిసి రోడ్లను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు సోమవారం ప్రారంభించారు . ఎమ్మెల్యే గా మెచ్చా నాగేశ్వరరావు 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మండలంలొ కొత్తగంగారం, పాతగంగారం, ముత్యాలంపాడు, రాజాపురం, బోగ్గంవారిగుంపు,చింతపేట, నల్లివారిగూడెం, సీతాయిగూడెం, కమలాపురం,రామచంద్రపురం, చాపరాలపల్లి , గుట్టగూడెం, సత్యంపేట,గ్రామాల్లో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు.తొలుత ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ను బీ. ఆర్.ఎస్ శ్రేణులు జగన్నాధపురం లో గజ మాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామస్థులను ఆత్మీయంగా పలకరిస్తూ, పర్య టించారు. ఈ సందర్బంగా మహిళలు మాట్లాడుతూ మళ్ళీ మీరే గెలవాలనీ,మాకు ఇంకా మంచి చేయాలనీ, మళ్ళీ మిమ్మలినే మా ఎమ్మెల్యే గా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. చాపరాలపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ ఇటీవలే ఫైర్ ఎస్ ఐ గా ఉద్యోగాన్ని సాధించిన సందర్భంగా శాలువాతో సత్కరించారు.ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మండల పర్యటనలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు 300 ద్వీ చక్ర వాహనాలతో జగన్నాధపురం నుండీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలోఎంపివో లక్ష్మయ్య, ఎంపిపి మట్ల నాగమణి, ఎంపిటిసి సున్నం సునీత, మెహర్రమని, ములకలపల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులుమొరంపూడి అప్పారావు ,దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వర్లు, సర్పంచులు బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు,యువ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.