UPDATES  

 ఘనంగా చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

మన్యం న్యూస్, అశ్వాపురం:అశ్వాపురం మండల మొండికుంట గ్రామపంచాయతీలో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు అధికారికంగా ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి , భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం లాఠీలను తూటాలను లెక్కచేయకుండా ఈ భూమి నాది ఈ పంట నాది మధ్యలో నీ పెత్తనమేంది అని మాటల తూటాలతో మహిళల్లో చైతన్యం రగిలించి కూలీలను, రైతులను ఏకతాటి మీదికి తీసుకొచ్చి దొరల ఆగడాలను విష్ణుర్ దేశ్ ముఖ్ దౌర్జన్యాలను ఎదిరించిన వీర వనిత అని ,1940లో జరిగిన తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో ఒక అగ్నికణిక చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు చెన్నూరి అంతయ్య ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెడవరపు సుధీర్ కార్యదర్శి ప్రవీణ్, చెన్నురి వెంకన్న, ఆవనగంటి సమ్మయ్య , రేపల్లె రాములు, రాసమళ్ళ ఎల్లయ్య,చిటికెన రమేశ్, శిరీష, దనమ్మ, సోమారపు పద్మ, ఎస్ఎంసి చైర్మెన్ కంధాల ఈశ్వర్ పులసాని సత్య నారా యణ, రెడ్డి, మిట్టకంటి వెంకట రెడ్డి, దేరంగుల శేఖర్,దారపు శీను, పాటి మన్మథ రెడ్డి,నూతలపాటి వెంకటేష్,మిట్టకంట్ సురేందర్ రెడ్డి,నూతలపాటి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !