మన్యం న్యూస్ అశ్వాపురం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో అశ్వాపురం మండల రామచంద్రపురం గ్రామ వాసి మొగిళ్ళ గిరిధర్ రెడ్డి సత్తా చాటారు. ఏ ఆర్ కానిస్టేబుల్ గా తెలంగాణ స్టేట్ పోలీస్ ఉద్యోగాన్ని సాధించారు. చిన్ననాటి నుండి కొలువు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగిన విద్యార్థి మొదటి దపాలోనే ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు బంధువుల మిత్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





