UPDATES  

 ఘనంగా కామ్రేడ్ గుర్రం వెంకటేశ్వర్లు 13వ వర్ధంతి

మన్యం న్యూస్ ,
నూగురు వెంకటాపురం:
మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ గుర్రం వెంకటేశ్వర్లు 13 వ వర్ధంతి సభ ఆర్ అండ్ &బీ గెస్ట్ హౌస్ ఆవరణలో వంకా రాములు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రం వెంకటేశ్వర్లు ఎక్కడో పుట్టి ఈ ప్రాంతానికి వచ్చి సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి రెండు సార్లు మండల కార్యదర్శి గా భద్రాచలం డివిజన్ కమిటీ సభ్యులుగా పనిచేసి ఈ ప్రాంతంలో గిరిజనులకు, పేదప్రజల కోసం ఉద్యమాలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండి నడిపించారని అన్నారు. మండలంలో సిపిఎం పార్టీ ఎదుగుదలకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు గుర్రం వెంకటేశ్వర్లు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు గ్యానం.వాసు, గుర్రం వెంకటేశ్వర్లు గారి సోదరులు ప్రముఖ వ్యాపారవేత్త గుర్రం పుల్లారావు, ఆదినారాయణ,పోశాలు, సత్యం, చిరంజీవి,ఇర్ప.శ్రీను,కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !