UPDATES  

 జాతీయ ఉపకారవేతనాలకు ప్రభుత్వ కళాశాల విద్యార్థినుల ఎంపిక

మన్యం న్యూస్, మంగపేట.
మార్చి 2023 ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎక్కటి సరోజినీ శేషారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంగపేట కు చెందిన
6 ఆరుగురు విద్యార్థినిలు బండారి, (982/1000 బీపీసీ ), గుర్రాల హేమలత (959/1000 BPC),దంతెన పల్లి మానస(956/1000 ఎంపీసీ ),
కుంచం రూపకళ(954/1000 ఎంపీసీ ),గుమ్మడాల నీలిమ(945/1000 బీపీసీ,)
గుడ్డేటి అఖిల( 938/1000 బీపీసీ ) లు కేంద్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం అందించే జాతీయ ప్రతిభా ఉపకారవేతనములకు ఎంపికైనారు. వీరికి డిగ్రీ స్థాయిలో మూడేళ్లు , పీజీ స్థాయిలో రెండేళ్లు ప్రతి సంవత్సరం 10 వేల చొప్పున ఉపకారవేతనం చెల్లిస్తారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జి .వెంకటయ్య, అధ్యాపకులు సంతోష్ కుమార్,రేణుకాదేవి, జ్యోతిర్మయి,లక్ష్మణ.అనిల్ కుమార్, రవీంద్రనాయక్, .శ్రీనివాస్, చిరంజీవి, .రాజు, .వైష్ణవి వందన హర్షం వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !