మన్యం న్యూస్ ,మణుగూరు: బొంబాయి కాలనీ లోని ఎక్సలెంట్ స్కూల్లో గురువారం ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థినులు బతుకమ్మలు పేర్చి బతుకమ్మ ఆడుతూ పాఠశాల చివరి రోజు ఆనందంగా గడిపారు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా తలిదండ్రులు తమ పిల్లలకి బతుకమ్మలు పేర్చి పంపించారు . ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, స్కూల్ కరస్పాండెంట్ జే.ఎం ఖాన్ ప్రిన్సిపాల్ బాను ఖాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.