మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైనా బతుకమ్మ పండుగను ఇల్లందు నియోజకవర్గ ఆడపడుచులు, ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ అమావాస్య నుండి తొమ్మిదిరోజుల పాటు ఆడపడుచులు అందరూ కలిసిఆడే గొప్పపండగ బతుకమ్మ అని దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్పపండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉండటం గొప్ప విషయమన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్పపండుగ బతుకమ్మ అని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్రపండుగగా గుర్తించిందన్నారు. ప్రతిఏటా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని గుర్తుచేశారు. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.