మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండల పరిధి లోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నందు దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న దేవీ ఉత్సవాల్లో బిటిపిఎస్ సిఈ బిచ్చన్న దంపతులు పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో అందరూ చల్లగా ఉండాలని ఆ తల్లిని వేడుకున్నట్లు సిఈ బిచ్చన్న తెలిపారు.ఈ కార్యక్రమంలో బిటిపిస్ ఇంజనీర్స్,కార్మిక సంఘ నాయకులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.