UPDATES  

 కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు ఐక్యంగా పనిచేస్తాం…

 

మన్యం న్యూస్, చండ్రుగొండ, అక్టోబర్ 19 : అశ్వరావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థికి ఐక్యతతో పనిచేసి గెలిపిస్తామని గురువారం చండ్రుగొండ లో ఆ పార్టీ కార్యకర్తలు భారీ ప్రదర్శన చేశారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి భారీ ప్రదర్శన గా అయ్యన్నపాలెం గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో వర్గాలకు తావు లేకుండా, అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించుకుంటామని, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించుకొని సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, వైఎస్ ఎంపిపి నరకుళ్ళ సత్యనారాయణ,సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, మాజీ ఎంపీపీ గుగులోతు బాబు, మాజీ జెడ్పిటిసి అంకిరెడ్డి కృష్ణారెడ్డి, సంకా కృపాకర్, సారేపల్లి శేఖర్, కేశబోయిన నరసింహారావు,ధారం గోవిందారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !