మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని స్థానిక జెడ్పీఛైర్మెన్ క్యాంప్ కార్యాలయం నందు పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డా డానియెల్ అధ్యక్షతన పట్టణ మాజీ కౌన్సిలర్ బదావత్ సరోజా, బిఆర్ఎస్ యువజన సంఘం నాయకులు గోపగాని రాజుతో పాటు మరో పది కుటుంబాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కోసం పూర్తిస్థాయిలో తమసహాయ సహకారాలు అందజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గోపగాని రాజు, కొండపల్లి సావిత్రి, కొండపల్లి మహేష్, వెంకన్న, ఐతా సత్యం, సుమన్, కృష్ణ, కాలుద్ధిన్ పాసి, ముఫిద్, శివ తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.