మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరులో మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాన్ని రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ తో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాఘవరెడ్డి పరిశీలించారు. అనంతరం 110 పినపాక ఎస్టీ నియోజకవర్గం పరిధి లోని 241 పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాలను ఆదేశించారు.ఈ నెల 30,31 వ తారఖున పోలింగ్ సిబ్బందికి మొదటి శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ తెలిపారు.