UPDATES  

 కళ్ళ ముందు సంక్షేమం,ఇంటి ముందు అభివృద్ధి బిఆర్ఎస్ ప్రచార హోరు

 

మన్యం న్యూస్ మణుగూరు:

మణుగూరు మండలంలోని కట్టుమల్లారం గ్రామ పంచాయతీలో మాజీ మండల అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది.అభివృద్ధి అంటేనే రేగ కాంతారావు అని,సంక్షేమాలకు నిలయంగా బిఆర్ఎస్ పాలన కొనసాగుతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలతో రైతులం ఎంతో గోసపడ్డమని,నాడు గృహ అవసరాలకు కూడా కరెంటు ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ కు ఓటేసే పరిస్థితి లేదని అన్నారు. రైతుబంధును యాసంగి పంటకు ఆపాలని కుట్ర చేస్తున్నటువంటి కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. అభివృద్ధి,సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జిగిడి ప్రసాద్, గ్రామ అధ్యక్షులు జగడి చలపతి,మడకం పోతురాజు, రావులపల్లివెంకట్,కడిదల సుదీర్,పొట్ల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !