అభివృద్ధి,సంక్షేమం బిఆర్ఎస్ తోనే సాధ్యం
కారు గుర్తుకు ఓటు వేద్దాం అభివృద్ధి కొనసాగిద్దాం
గ్రామాలలో గడప గడపకు విస్తృత ప్రచారం
జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయ కుమారి
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లో బిఆర్ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల పరిధి లోని సమితి సింగారం,అశోక్ నగర్,వాగు మల్లారం గ్రామాలలో జడ్పీటిసి పోశం నరసింహారావు,ఎంపీపీ కారం విజయ కుమారి ఆధ్వర్యంలో గడప గడపకు విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.సీఎం కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో తో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుతుందని అన్నారు.రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి 10 వేలు ఇస్తుండగా వాటిని 16 వేలకు పెంచినట్లు తెలిపారు.సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద మహిళలకు 3 వేలు,ఆసరా పింఛన్లు 5 వేలు,దివ్యాంగు లకు 6 వేలు చెల్లిస్తామన్నారు. పేదలకు తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం అందిస్తామని,ప్రతి కుటుంబానికి కేసీఆర్ భీమా ద్వారా 5 లక్షల బీమా కల్పిస్తామని తెలిపారు. బిఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ,గడప గడపకు విస్తృత ప్రచారం నిర్వహించారు.పినపాక నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.రాబోయే ఎన్నికల్లో మరొకసారి బిఆర్ఎస్ కు ఓటు వేసి అభివృద్ధి,సంక్షేమ ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ ప్రజప్రతినిధులు,ఎంపీటీసీ రమ్య,వార్డు మెంబర్లు,పార్టీ కార్యదర్శి రామిరెడ్డి,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.