మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు శుక్రవారం గుండాల, ఆళ్లపల్లి మండలాలలో పర్యటించి నూతన వధూవరులను ఆశీర్వదించారు. మండల కేంద్రంలో నూతనంగా వివాహం చేసుకున్న కందుకూరి సంతోష్ సంధ్య దంపతులను ఆశీర్వదించి ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రవణ్ అన్న కొడుకు ఫణి కుమార్, అనూష దంపతులను ఆశీర్వదించారు, ప్రతినిధి కోలేటి భవాని శంకర్,గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, ఆళ్లపల్లి ఎంపీపీ మంజు భార్గవి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
