మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని నియోజవర్గ అభివృద్ధి కొరకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్ల వెంకటరావు కోరారు. శుక్రవారం మండలంలోని తన స్వగ్రాహమైన కాశి నగరం పంచాయతీలో విస్తృతంగా పర్యటించారు. దీనిలో భాగంగా ఎం కాశినారం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఆకర్షితులై సిపిఎం పార్టీ నుంచి 30 కుటుంబాలు చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, భద్రాచలం నియోజవర్గంలో స్థానిక నాయకుడిని అయినటువంటి నాకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం పలు గ్రామాలు పర్యటిస్తూ సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తెల్లం సీతమ్మ మండల అధ్యక్షులు సత్యనారాయణమూర్తి ప్రధాన కార్యదర్శి రాముడు ఉపాధ్యక్షులు కామేష్ ఎంపీటీసీలు తిరుపతిరావు రామారావు సీనియర్ నాయకులు రమేష్ గౌడ్ నవాబ్ తదితరులు పాల్గొన్నారు.