ప్రచారంలో దూసుకుపోతున్న డా.తెల్లం
*ఒక్క అవకాశం ఇవ్వండి… అభివృద్ధి చేసి చూపెడతా
*భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం
మన్యం న్యూస్ ,చర్ల:
భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా చర్ల మండలం మామిడి గూడెం, కుదునూరు గ్రామాలలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు . ఈ సందర్భంగా డా.తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ …తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించి భద్రాచలం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని కోరారు. కల్లబొల్లి మాటలు చెప్పే నాయకులను నమ్మదు అని, లోకల్ అభ్యర్థి అయిన నన్ను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిని సాధిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ నాయకులు రమేష్ గౌడ్, ఎంపీపీ కోదండరామయ్య, పార్టీ మండల ప్రచార కార్యదర్శి కోటేరు రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు కాపుల నాగరాజు, కాకి అనిల్, ఈశ్వర్, వినోద్, ఎంపీటీసీ కుంజా నాగేశ్వరరావు, ఆర్ కొత్తగూడెం మాజీ సర్పంచ్ తుర్రం రవి, సీనియర్ నాయకులు సీతాపతి రాజు, కోప్పినీడు బాబురావు, తాతరాజు, ముప్పిడి రమేష్, వేములవాడ కృష్ణార్జునరావు, విజయ్, తదితరులు పాల్గొన్నారు.