UPDATES  

 సంక్షేమ సర్కారు కావాలా.. సంక్షోభ సర్కారు కావాలా

సంక్షేమ సర్కారు కావాలా.. సంక్షోభ సర్కారు కావాలా
ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి
సంక్షేమం కొనసాగలంటే బీఆర్ఎస్ సర్కారే రావాలి
పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్ గుండాల: సంక్షేమ సర్కారు కావాలో సంక్షోభ సర్కారు కావాలో ప్రజలే ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గం అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం గుండాల మండలంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి బీ ఆర్ ఎస్ మేనిఫెస్టో పై ప్రజలకు వివరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. అభివృద్ధి సంక్షేమం ఆగొద్దు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏ రాష్ట్రంలోనైనా ఉందా అని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని అన్నారు. గుండాల, ఆళ్లపల్లి మండలాలలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడైన జరిగిందా అని అన్నారు. నేను గెలిచిన తర్వాత వందల కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రూపకల్పన చేసిన మేనిఫెస్టో చూస్తుంటే అద్భుతంగా ఉందని అన్నారు. అగ్రవర్ణ పేదల కోసం గురుకుల కళాశాలలు, అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేసి పట్టాలిస్తామని కెసిఆర్ బీమా కింద ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. పథకం కింద తెల్ల రేషన్ కార్డ్ దారులు అందరికీ సన్నబియ్యాన్ని ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసరా పెన్షన్ ఐదు రూపాయల రూపాయలకు పెంచుతూ మేనిఫెస్టోలో ప్రకటించామని అన్నారు. రైతు బంధు పథకం కింద గతంలో పదివేల రూపాయలు ఇస్తే దాన్ని ఇప్పుడు 16 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య రక్షక కింద తెల్ల రేషన్ కార్డుదారులందరికీ జర్నలిస్టులందరికీ 15 లక్షల వరకు హెల్త్ బీమాను ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. లక్ష్మీ పథకం కింద అర్హులైన మహిళలందరికీ మూడు వేల రూపాయలను ఇవ్వనున్నట్లు ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను విచ్చలవిడిగా పెంచుతూ పోతుందని సామాన్యులు గ్యాస్ కొనాలంటేనే పెనుపారమైందని అందుచేత గ్యాస్ సిలిండర్ను 400 రూపాయలకే రానున్న ప్రభుత్వంలో ఇవ్వనున్నట్లు అన్నారు. మహిళ సమైక్యలకు సొంత భవనాలు పేదలకు ఇండ్ల స్థలాలు అనాధ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ ఏజెన్సీలో ఉండే గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలను రానున్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చుట్టుపక్కల ప్రవహిస్తున్న వాగులపై చెక్ డాములు నిర్మించి వాటిపై ఎత్తిపోతల పథకాలను పెడితే స్థానిక చెరువులకు నీరు అందుతుందని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయాన్ని చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారాలన్నిటిని పూర్తి చేయించామని మరో మారు ప్రజల ఆశీర్వదిచ్చి అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఆగిన సంక్షేమాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రగతిని సాధించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండాల ఆళ్లపల్లి మండలాల ఇన్చార్జ్ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్, పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, సర్పంచ్ నరసింహారావు, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు,ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, అధ్యక్షులు లక్ష్మీనారాయణ, పార్టీ వార్డు మెంబర్ రాము, శ్రీను, నాగేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !