మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 27:
కారేపల్లి మండలం,ఉసిరికాయలపల్లి శ్రీ కోటమైసమ్మ తల్లి జాతర శుక్రవారం ఆఖరి రోజు అదే జోష్.జాతరకు జనం పొటెత్తారు.ఏజన్సీ ప్రాంతంలో పెద్ద జాతరైన ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి జాతర 5 రోజుల పాటు నిరంతరాయం సాగుతుండటంతో జాతర చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని,అమ్మవారికి మొక్కులను చెల్లించారు.ఈ సందర్భంగా ఆలయం చైర్మన్ పర్స పట్టాభి రామారావు మాట్లాడుతూ,జాతరకి సహకరించిన పోలీసు అధికారులకు,భక్తులు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
