UPDATES  

 గోపాలరావుపేట లో గడపగడపకు బిఆర్ఎస్ కార్యక్రమం

మన్యం న్యూస్ ,పినపాక : మండల వ్యాప్తంగా శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. తోగ్గూడెం పంచాయతీ గోపాలరావుపేటలో బుస్సి శ్రీనివాస్ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, సొసైటీ డైరెక్టర్ కటకం గణేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు.గడపగడపకు బి ఆర్ఎస్ పథకాలను వివరించారు.
కారు గుర్తుకు ఓటు వేసి రేగా కాంతారావుని గెలిపించాలని కోరారు.గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని వేల కోట్లతో అన్ని రంగాలలో రేగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి పథకాలు అందాయన్నారు, సీఎం కేసీఆర్ గారు ప్రకటించిన బిఆర్ఎస్ నూతన మ్యానిఫెస్టో తో ప్రజలకు ఎంతో మేలు జరుతుందని అన్నారు.
పినపాక నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ కే పట్టం కట్టాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి మొదటిసారి పినపాక ఇలాకాలో బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని మూడవసారి రేగా కాంతారావు కి అవకాశం ఇచ్చి అన్ని బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడే నాయకుడిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలన్నారు.సీఎం కేసీఆర్ గారి సారధ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టింది అన్న ప్రస్తుతం రైతులకు ఎకరానికి 10000 ఇస్తుండగా వాటిని 16 వేలకు పెంచినట్లు తెలిపారు కళ్యాణ లక్ష్మి పథకం కింద రెండు లక్షలు గ్యాస్ సిలిండర్ 400 కి ఇస్తామని సీఎం కేసీఆర్ గారు ప్రకటించినట్లు తెలిపారు.సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళలకు 3 వేలు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పథకం కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !