మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను జెడ్పీ సీఈవో విద్యలత పర్యావేక్షించారు. శుక్రవారం ఇల్లందు మండలం శుభాష్ నగర్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు కు అవసరం అయిన విద్యుత్, మంచి నీరు, మరుగుదొడ్లు తదితర వసతులను మెరుగు పర్చాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ బాలరాజు, కార్యదర్శి రజినీకాంత్, హైస్కూల్ హెచ్ఎం ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.