మన్యం న్యూస్,పినపాక:
మండల పరిధి గోపాలరావుపేట గ్రామానికి చెందిన కొమరం భూషణం అనే వ్యక్తికి యాక్సిడెంట్ కావడంతో కాలుకి 16 కుట్లు పడి నడవలేని పరిస్థితుల్లో మంచంపై ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ బుద్ధ రాజు నవీన్ రాజు శుక్రవారం బాధిత వ్యక్తికిరూ.5వేల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. భూషణం కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కటకం గణేష్,కొంపెల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
