మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులతో సంబంధం
ఉన్న 307 ద్విచక్ర వాహనాలు 17 కార్లు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ అయిన హేమచంద్రపురం నందు ఉంచడం జరిగిందని జిల్లా పోలీస్ వాహనాల అధికారి(ఎంటిఓ) సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి వాహనాలకు సంబంధించి సరైన పత్రాలను చూపించి తమ వాహనాలను పొందవచ్చునని వెల్లడించారు. ముందుగా ఈ వాహనాలకు సంబంధించి సరైన పత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్లలో సమర్పించి అక్కడి నుండి రుజువు పత్రాన్ని పోంది మోటారు వాహనాల అధికారి కార్యాలయంలో సమర్పించి తిరిగి వారి వాహనాన్ని పొందవచ్చని తెలిపారు.జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి సూచనల ప్రకారం ఈ వాహనాల జాబితాను జిల్లా పోలీస్ సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచడమైనదని తెలిపారు. ఇట్టి వాహనాల యజమానులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు.