మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 27:
తెలంగాణ గిరిజన సంఘం కారేపల్లి మండల అధ్యక్షులు, సీపీఎం నాయకులు అజ్మీర శోభన్నాయక్ శుక్రవారం రోడ్డు ప్రమాదం గాయపడ్డారు.ఖమ్మంలో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శోభన్నాయక్ను సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ,గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా కృష్ణలు పరామర్శించారు.శోభన్ ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి వైద్యులు డాక్టర్ టీ.మదన్సింగ్తో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు.
