మన్యం న్యూస్ కరకగూడెం: పినపాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా. కాంతారావు గెలుపు కాంక్షిస్తూ కారు గుర్తుకే ఓటేయాలని గొల్లగూడెం గ్రామంలోని 27,28 ఎన్నికల బూతులలో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్ మాట్లాడుతూ శుక్రవారం మండల పరిధిలోని చిరుమళ్ళ,వట్టంవారి గుంపు,పద్మపూరం గ్రామాలలో విస్తృతంగా పర్యటించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు కారు గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు.అలాగే సీఎం కేసీఆర్ ప్రకటించిన పానిఫెస్టోలను ప్రజలకు చదివి వివరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు మల్కం. వెంకటేశ్వర్లు, ఎన్నికల బూత్ కమిటీ ఇన్చార్జి రావుల.శ్రీను,చిట్టి. సత్తిష్,యువజన నాయకులు కటకం.లేలిన్, ఎగ్గడి.శ్రీనివాస్,సుతారి.నాగేశ్వరరావు, గుడ్ల.రంజీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
