UPDATES  

 ఎమ్మెల్యేరేగాకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం

మన్యం న్యూస్,భూర్గంపాడు: మండల పరిధి
సారపాక పంచాయతీ ఖాసీం సార్ వీధి కాలనీ వాసులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఏకగ్రీవ తీర్మానం చేశారు. వివరాలు ఇలాఉన్నాయి. గతంలో కురిసిన భారీ వరదల మూలంగా సారపాక పంచాయతీలోని పలు కాలనీలు గోదావరి ఉగ్రరూపంతో నీట మునగాయి. ఆ సమయంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు,
జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత , బీఆర్ఎస్ పార్టీ మండల ప్రజా ప్రతినిధులు, యువజన విభాగం నాయకులు వారికి అండగా నిలిచారు . అంతేకాకుండా బూర్గంపాడు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ప్రజల వద్దకు ప్రజా సమస్యల పరిష్కారం అనే కార్యక్రమం నిర్వహించి వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం జడ్పిటిసి శ్రీలత ఎమ్మెల్యే రేగా దృష్టికి తీసుకెళ్లగా ఆ కాలనీ వాసులకు రూ లక్షలు వెచ్చించి సీసీ రోడ్లు వేయించారు. ఈ నేపథ్యంలో కష్టకాలంలో అండగా ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఆ కాలనీవాసులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !