మారుముల గ్రామీణ ప్రాంతంలో విస్తృత ప్రచారం
పూసుకుంట గ్రామంలో ప్రచారం నిర్వహించిన అశ్వారావుపేట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు
మన్యం న్యూస్, దమ్మపేట, అక్టోబర్, 28: మండల పరిదిలోని పూసుకుంట గ్రామ పంచాయతీలో అశ్వారావుపేట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విస్తృతంగా ప్రచారం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మరియు అమలు చేసిన సంక్షేమ పథకాలను అలాగే బీఆర్ఎస్ పార్టీ యొక్క మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు.ప్రతి ఒకరితో ఆత్మీయంగా మాట్లాడుతూ సమయం గడిపారు అలాగే సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎన్నడూ లేనివిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తమ గ్రామానికి అభివృద్ధి జరిగిందని, తప్పకుండా రానున్న ఎన్నికలో ఎది ఏమైనా ఓటు మాత్రం కారు గుర్తుకే వేస్తామని బీఆర్ఎస్ పార్టీ ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొడ్డకుల రాజేశ్వరరావు, ఎంపీటీసీ సోడెం మహాలక్ష్మి గంగరాజు, సర్పంచ్, బోలికొండ ప్రభాకర్, రాయల నాగేశ్వరరావు, దొడ్డ నాగేశ్వరరావు, బాల శ్రీను, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.