UPDATES  

 బిఆర్ఎస్ లో భారీగా చేరికలు

  • బిఆర్ఎస్ లో భారీగా చేరికలు
  • అభివృద్ధి,సంక్షేమానికి అండగా నిలుస్తున్న ప్రజలు
  • రాజపేట గ్రామం నుండి 30 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరిక
  • కండువా కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు:

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజపేట ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 30 కుటుంబాలు అభివృద్ధి,సంక్షేమ పథకాలు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈసందర్భంగా ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతరావు వారిను గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,బిఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజల మ్యానిఫెస్టో అని,దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ మేనిఫెస్టో రూపొందించారు అన్నారు.ఇందులో కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి బీమా పథకం చారిత్మత్మకమైన పథకం అన్నారు.ఈ పథకం అమలు అయితే రాష్ట్రంలోని 90 లక్షల మంది పేద కుటుంబాలకు దీమాగా నిలుస్తుందని వారు తెలిపారు.గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు భరోసా కల్పిస్తామన్నారు,ఇక రేషన్ దుకాణాల లో ప్రతి దుకాణానికి సన్న బియ్యం అందించడం గొప్ప ఆలోచన అని,ఇప్పటికే రాష్ట్రం లోని 24 వేల పాఠశాలలకు,గురుకులా లలో సన్న బియ్యంతో భోజనం పెడుతున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు.పింఛన్లలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా దివ్యాంగులకు ఇస్తున్న రూ.4016 ను దశలవారీగా రూ.6,016కు పెంచుతామని,ఆసరా పెన్షన్ రూ 2016,సైతం దశలవారీగా రూ.5,016 పెరుగుతుంద అని అన్నారు.రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని,పేదలకు కుటుంబాలకు 400 కే సిలిండర్ అందజేస్తామన్నారు.మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న ప్రతి పథకాన్ని యధావిధిగా కొనసాగిస్తామని విప్ రేగా తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు,పార్టీ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !