మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని కూనవరం గ్రామ పంచాయతీ నందు బొడ్రాయి సెంటర్ లో నివాసం ఉంటున్న చెరుకు సత్యనారాయణ అనారోగ్యం తో మృతి చెందగా,వారిది అతి నిరుపేద కుటుంబం అని ఎంపిటిసి గుడిపూడి. కోటేశ్వరరావు ద్వారా తెలుసుకున్న మేము సైతం మిత్ర మండలి సభ్యులు వెంటనే స్పందించి,మృతి చెందిన వారి నివాసానికి వెళ్ళి దహన సంస్కరాలకు మూడు వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.సరైన సమయం లో స్పందించి ఆర్ధిక సహాయం చేసినందుకు మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్టు సభ్యులు ను కూనవరం సర్పంచ్ ఏనిక.ప్రసాద్, ఎంపిటిసి గుడిపూడి. కోటేశ్వరరావులు అభినందించారు.ఈ కార్యక్రమంలో మేము సైతం మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.