మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలంలోని సమితి సింగారం పంచాయతీ బాపూజీ నగర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దెల తిరుమలరావు మామ ఏంపల్లి నరసయ్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మరణించారు. విషయం తెలుసుకుని నరసయ్య పార్థివ దేహానికి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోయిళ్ళ రమణయ్య,నైనారపు,నాగేశ్వరరావు,నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ నాయకులు మిద్దెపాక యాదగిరి.కన్నెగంటి వేణు. హ్యాండ్ రైటింగ్ హుస్సేన్,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,బోయిళ్ళ రాజు,వై సతీష్,తదితరులు పాల్గొన్నారు.