UPDATES  

 కారు ప్రచార జోరు,ప్రతిపక్ష పార్టీలు బేజారు గడప గడపకు బిఆర్ఎస్ విస్తృత ప్రచారం

  • కారు ప్రచార జోరు,ప్రతిపక్ష పార్టీలు బేజారు
  • గడప గడపకు బిఆర్ఎస్ విస్తృత ప్రచారం
  • బిఆర్ఎస్ మేనిఫెస్టో సూపర్ హిట్
  • పినపాకలో బిఆర్ఎస్ కు పెరుగుతున్న మద్దతు

మన్యం న్యూస్ మణుగూరు:

మణుగూరు మండలంలోని గ్రామ గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరు పెంచింది. బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు గడప గడపకు విస్తృతంగా తిరుగుతూ,పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రచారంలో మండలంలోని సమితి సింగారం,అశోక్ నగర్ రామానుజవరం,గుట్ట మల్లారం వాగు మల్లారం,గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అభివృద్ధి, సంక్షేమం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు.రైతులకు రైతుబంధు,రైతు బీమా, మహిళలకు కల్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి,కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. బిఆర్ఎస్ మేనిఫెస్టో తో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.కెసిఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా కల్పిస్తామన్నారు.గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. ఆసరా పెన్షన్లు 3 వేల నుండి 5వేలకు పెంచుతామని, దివ్యాంగులకు 4 వేల నుండి 6 వేలకు పెంచుతామన్నారు. ఆరోగ్య రక్షతో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని,అన్నపూర్ణ పథకంతో పేదలందరికీ సన్న బియ్యం అందిస్తామన్నారు. పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలతో అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ముందే ఉన్నాయని,అభివృద్ధి ని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు.రానున్న ఎన్నికల్లో కారు గుర్తు కు ఓటు వేసి ఎమ్మెల్యే రేగా కాంతారావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయ కుమారి, ఎంపీటీసీలు బాబురావు, గాజుల రమ్య,సర్పంచ్ కారం ముత్తయ్య, సొసైటీ డైరెక్టర్ మామిడిపల్లి సీతారాములు, నాయకులు ఎడ్ల శ్రీను, సత్యంబాబు,మల్లేశ్వరరావు,మల్లికార్జున్,రామయ్య,బాబురావు,గంజి నరేందర్,వార్డు మెంబెర్ లు,బీరమ్మ,వనమాల లీలావతి నాగమణి నీరజ, ఉమా,గాజుల నరేష్,బోయిళ్ల రమణయ్య,బోయిళ్ల రాజు, సతీష్,100 ఓట్ల ఇన్చార్జులు, పార్టీ కార్యకర్తలు,యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !