మన్యం న్యూస్ ,పినపాక:
మండల పరిధి గోపాలరావుపేట గ్రామంలో కోఆర్డినేటర్ ఊడుగుల రామచంద్రు,మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కటకం గణేష్ , ఉపసర్పంచ్ బుస్సి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2వ రోజు గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది.
బీ ఆర్ఎస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా, అన్నపూర్ణ పథకం కింద ప్రతి తెల్ల రేషన్ కార్డుకు సన్న బియ్యం, ఆసరాపించన్ 5016, దివ్యాంగులకు 6000, రైతుబంధు 16,000 , కెసిఆర్ ఆరోగ్య రక్ష 15 లక్షలు, భాగ్యలక్ష్మి ప్రతి పేద ఇంటి మహిళలకు 3000 రూపాయలు జీవనభృతి గ్యాస్ సిలిండర్ 400 అగ్రవర్ణ కులాలకు ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు జర్నలిస్టులకు వైద్య బీమా ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు వంటి ప్రణాళికను ప్రజలకు వివరించారు. ప్రజలనుండి విశేష స్పందన లభించింది. రేగా కాంతరావు ని తప్పకుండా గెలిపించుకుంటామని ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామపంచాయతీ అధ్యక్షుడు కారుకూరి తిరుపతి, నాయకులు గంగరబోయిన రామకృష్ణ, కేపా సతీష్ , అనిపెద్ది బాబురావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
