మన్యం న్యూస్ ,అశ్వాపురం: మండల పరిధి మొండికుంట గ్రామానికి చెందిన కందిమల్ల శ్రీధర్ రెడ్డి, ఎడ్ల సంతోష్ రెడ్డి లు శుక్రవారం నాడు రాత్రి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావుశనివారం మృతుల నివాసాలకు వెళ్లి మృతుల పార్థివ దేహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడి అమరేందర్,జడ్పిటిసి సూది రెడ్డి సులక్షన,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సర్పంచ్ మర్రి మల్లారెడ్డి,ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్,ఎక్స్ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,జాలె రామకృష్ణారెడ్డి, యువజన అధ్యక్షులు గద్దల రామకృష్ణ,మండల నాయకులు,యువజన నాయకులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
