రేగాకు అండగా అభివృద్ధి
- పినపాకలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు
- దళిత బందుతో దళిత కుటుంబాల ఆనందం
- బీసీ బందుతో ఆర్థికంగా ఎదుగుదల
- పోడు సాగుదారులకు పట్టాలు
- రైతుబంధుతో వ్యవసాయం కల కల
- వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్
- ఆరోగ్య సేవలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
- ప్రతి గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు
- రవాణా సౌకర్యం మెరుగుతో ప్రజల ఆనందం
పేదల కోసం పుట్టిన నాయకుడిగా రేగాకు కితాబు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు 9 సంవత్సరాలలో సుమారు 364 పథకాలు ముందుకు తీసుకొచ్చి వాటిని విజయవంతంగా అమలు చేయడం ఆయనకే సాధ్యమైంది. 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాలు ఏర్పడడం తండాలు గ్రామ పంచాయతీలుగా మారడం పరిపాలన సులభతరం ప్రజల వద్దకే సేవలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి. భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షులు, సీఎం కేసీఆర్ పరిపాలన సక్సెస్ గా ముందుకు పోతుండడంతో ప్రజలంతా జై.. తెలంగాణ జై.. కేసీఆర్ అంటూ మళ్లీ కేసీఆర్ సీఎంగా ఉండాలి.. పినపాకకు ఎమ్మెల్యేగా రేగా కాంతారావే ఉండాలని గులాబి అభిమానులు ఏకగ్రీవ తీర్మానాలు చేయడం చర్చ నియాంశంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల పోరుకు సమయం దగ్గర పడుతుండడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తన గెలుపే లక్ష్యంగా గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసుకున్నారు. అంతేకాకుండా రేగా కాంతారావు బీఆర్ఎస్ పథకాల మేనిఫెస్టోను పినపాక నియోజకవర్గంలో ప్రతి గుమ్మ ముందుకి తీసుకువెళ్లి జరిగిన అభివృద్ధిని వివరించడంతోపాటుగా మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అమలు జరిగే సంక్షేమ పథకాల తీరును తెలియపరుస్తూ
ఓట్లను అభ్యర్థించడం జరుగుతుంది. తన హయాంలో పినపాక ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగిందని రేగా ప్రజలకు ఆలోచింప చేసే విధంగా ప్రచారం చేయడం ముందంజలో ఉన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు సంపూర్ణంగా అందుతున్నాయని వివరిస్తున్నారు. దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయని, బీసీ బందు పథకం ఆర్థికంగా కుటుంబాలు ఎదిగేందుకు ఉపయోగపడిందని రేగా ఎన్నికల ప్రచారంలో తెలియపరుస్తున్నారు.
*రేగా కృషి ఫలితం పోడు పట్టాలు…*
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి ఫలితంగా అనేక ఏండ్లుగా పోడు చేసుకుంటున్న సాగుదారులకు జిల్లావ్యాప్తంగా పట్టాలు ఇప్పించిన ఘనత ఆయనదే. మన్యం బిడ్డగా ఉన్న రేగా కాంతారావు సాగుదారులకు పట్టాలు ఇప్పించడంతో వారిలో ఆనందం వెళ్లి విరిసింది. పట్టాలు పొందిన వారంతా రేగా కాంతారావుకి జై కొడుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయననే గెలిపించుకుని తీరుతామని స్పష్టం చేయడం గమనార్హం.
*రైతుబంధుతో వ్యవసాయం కలకల…*
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అర్హులైన రైతులందరికీ రైతుబంధు ఇప్పించడంతో ఆ రైతులంతా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ కాంతారావు చేసిన సేవలను కొనియాడుతూ ఈసారి ఎన్నికల్లో రేగాకే తమ ఓటు అని రైతులు బహిరంగంగా పేర్కొంటున్నారు.
*వ్యవసాయానికి 24 గంటల కరెంట్…*
పినపాకకు ఎమ్మెల్యేగా ఉన్న రేగా కాంతారావు తన ఐదేళ్ల పాలనలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు సమృద్ధిగా అందుతుందని కొంతమంది రైతులు స్వయంగా మాట్లాడుకోవడం గమనార్హం. పినపాక పరిధిలోని పలు మండలాల్లో వ్యవసాయం పచ్చదనంతో కలకలలాడుతుందంటే అది రేగా పుణ్యమేనని రైతు కుటుంబాలు కొనియాడుతున్నాయి.
*పేదల కోసం పుట్టిన నాయకుడిగా రేగాకు కితాబు…*
పినపాకతో పాటు పలు మండలాల్లో గ్రామాల్లో సీసీ రోడ్డు డ్రైనేజీలు నిర్మాణం వాగులపై వంతెనల ఏర్పాటుతో ప్రజల సౌకర్యం భారీగా మెరుగుపడింది. ఆరోగ్య కేంద్రాల సైతం ఏర్పాటు చేయించి గిరిజన ప్రజలకు ఆరోగ్య సేవలు దరి చేరడంతో ఇందుకు కారణమైన ఎమ్మెల్యే రేగా కాంతారావును పేదల కోసం పుట్టిన నాయకుడిగా పలువురు వర్ణించుకోవడం విశేషం. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రేగా కాంతారావును మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకుని తీరుతామని గిరిజన ఓటర్లు స్పష్టం చేస్తున్నారు.