UPDATES  

 ఎంపీ కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి…

మన్యం న్యూస్,అక్టోబర్31:

దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దుండగులు దాడి చేసి గాయపర్చటం అమానుష చర్య అని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్‌,జడ్పీటీసీ వాంకుడోత్‌ జగన్‌  అన్నారు.కారేపల్లి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు  మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ప్రభాకర్‌ రెడ్డిపై దాడికి పాల్పడన దానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈసమావేశంలో వైస్‌ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు,రైతు బంధు జిల్లా సభ్యులు ఉన్నం వీరేందర్‌, నాయకులు హన్మకొండ రమేష్‌, నర్సింగ్‌ శ్రీనివాసరావు, దారావత్‌ బద్దూలాల్‌, గౌసుద్దీన్‌, బానోత్‌ కుమార్‌, భూక్య చందూనాయక్‌, కరణ్‌ సింగ్‌,రోషయ్య,భూక్య రాంకిషోర్‌, బానోత్‌ కోటి, సోమందులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !