UPDATES  

 మావోయిస్టులకు ఎవరు భయపడవద్దు.. నిర్భయంగా ఓటు వేయండి..

  • మావోయిస్టులకు ఎవరు భయపడవద్దు
  •  నిర్భయంగా ఓటు వేయండి.
  •   మీకు భద్రతగా మేముంటాం
  •  జిల్లా ఎస్ పి గౌష్ ఆలం ఐ పి ఎస్
  • వెంకటాపురం పరిధిలో ఫ్లాగ్ మార్చి నిర్వహించిన జిల్లా ఎస్ పి.

మన్యం న్యూస్

నూగూర్ వెంకటాపురం

ములుగు జిల్లా వెంకటాపురం

మండలంలో ఈరోజు పోలీసు బలగాలు ఎస్పీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న మండలం అవ్వడంతో ఓటు వేయడానికి భయపడే ప్రజలకు ధైర్యాన్ని నింపే దిశగా వారిని చైతన్యపరిచే భాగంగా మండలంలో సందు సందుకు తిరిగి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలకు పోలీసు బలగాలు ఎప్పుడు తోడుగా ఉంటాయని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించు కొని మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో తమ పాత్ర పోషించాలని ప్రధాన రహదారుల వెంబడి వాడ వాడ తిరుగుతూ ప్రజలలో ఎన్నికల పట్ల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా అవగాహన కల్పించారు. .

 

ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరి శెట్టి సంకీర్త్ ఐ పి ఎస్ సి ఐ వెంకటాపురం కుమార్ ఎస్ ఐ వెంకటాపురం అశోక్ ఎస్ ఐ తిరుపతి రావు CRPF సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !