- బీ ఆర్ ఎస్ హ్యాట్రిక్ విజయం పక్కా
పినపాక నియోజకవర్గం లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే
కాంగ్రెస్ హామీలు నీటిమూటలే
మ్యానిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేసిన ఘనత దేశంలో బీఆర్ఎస్ పార్టీదే
చేసిన పనులు ప్రజలకు చెప్పడానికి బీఆర్ఎస్ కు వంద ఉంటే కాంగ్రెస్ కు ఏమి లేదు
రైతులతో వరి కోసి ఓటును అభ్యర్థించిన ప్రభుత్వవిప్,బీ ఆర్ ఎస్ పినపాక ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు
మన్యం న్యూస్ కరకగూడెం:రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ హ్యాట్రిక్ విజయం పక్కా అని విప్ , పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు. మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామపంచాయతిలో గల పోలకమ్మతోగు గ్రామంలో రేగా కాంతారావు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరి కోత కోస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారితో కాసేపు వరి కోసి,వారితో మాట్లాడి ఈనెల 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.అదేవిధంగా పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశాలలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా ఏకమవుతున్న శత్రువుల నాటకాలకు రాబోయే 14 రోజుల పాటు నిరంతరం ప్రజాక్షేత్రం లో బీఆర్ఎస్ సైనికులు తిప్పి కొట్టాలి అని పిలుపు నిచ్చారు.గడప గడపకు మ్యానిఫెస్టోను చేర్చే బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులదే అన్నారు.కాంగ్రెస్ హామీలు నీటిమూటలే అని, మ్యానిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేసిన ఘనత దేశంలో బీఆర్ఎస్ పార్టీ ది మాత్రమే అన్నారు.చేసినవి ప్రజలకు చెప్పడానికి బీఆర్ఎస్ కు వంద ఉంటే.. చెప్పుకోవడానికి కాంగ్రెస్ కు ఏమి లేదు అన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లపాటు ఉద్యమించి, కేంద్రంతో కొట్లాడి సాధించుకొన్న తెలంగాణను ఈ పదేండ్లలో సాగు, తాగునీరు, మౌలిక వసతులు, సబ్బండ వర్గాల అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాలు, దేశంలోనే మిన్నగా ఐటీ అభివృద్ధి, రైతుల సర్వతోముఖాభివృద్ధి, మహిళాభ్యున్నతి,గ్రామాలు, పట్టణాల అభివృద్ధి ఇలా ఏ రంగం చూసిన అభివృద్ధిలో ముందుకుపోతున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ అభివృద్ధి పరుగులు ఆగకుండా ఉండాలంటే అందరూ ఆశించిన బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాలంటే ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చి, కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం ఒక్కటే మార్గం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు నీటిమూటలేనని, వారికి మాటలు తప్ప చేతలు తెలియవని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందన్నారు. ఇప్పటికే రైతుబీమా తరహాలో బీమా సౌకర్యం కల్పిస్తుండగా ఇక నుంచి తెల్లరేషన్కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ.5లక్షల బీమా అందిస్తానని ప్రకటించారన్నారు. రూ.400లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు సౌభాగ్యలక్ష్మి కింద రూ.3వేలు, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం, రైతుబంధు రూ.16వేలు, ఆసరా పెన్షన్లు పెంపు వంటి వినూత్న పథకాలు ప్రకటించారని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ పథకాలన్నీ అమలుచేసే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వారి పరిపాలనలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడంలేదంటూ ప్రశ్నించారు. ఇప్పటికే కర్నాటకలో విద్యుత్ సరఫరా లేక రైతులు రోడ్డెక్కుతున్నారని ఆ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఆరోపించారు. దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. పినపాక నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి రేగా కాళికా,సర్పంచ్ పాయం,నరసింహరావు, ఊకే. రామనాథం,మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు పాయం.రాజబాబు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకు,కార్యకర్తలు పాల్గొన్నారు.
*పినపాక నియోజకవర్గం లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే*
*కాంగ్రెస్ హామీలు నీటిమూటలే*
*మ్యానిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేసిన ఘనత దేశంలో బీఆర్ఎస్ పార్టీదే*
*చేసిన పనులు ప్రజలకు చెప్పడానికి బీఆర్ఎస్ కు వంద ఉంటే కాంగ్రెస్ కు ఏమి లేదు*
*రైతులతో వరి కోసి ఓటును అభ్యర్థించిన ప్రభుత్వవిప్,బీ ఆర్ ఎస్ పినపాక ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు*
మన్యం న్యూస్ కరకగూడెం:రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ హ్యాట్రిక్ విజయం పక్కా అని విప్ , పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు. మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామపంచాయతిలో గల పోలకమ్మతోగు గ్రామంలో రేగా కాంతారావు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరి కోత కోస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారితో కాసేపు వరి కోసి,వారితో మాట్లాడి ఈనెల 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.అదేవిధంగా పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశాలలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా ఏకమవుతున్న శత్రువుల నాటకాలకు రాబోయే 14 రోజుల పాటు నిరంతరం ప్రజాక్షేత్రం లో బీఆర్ఎస్ సైనికులు తిప్పి కొట్టాలి అని పిలుపు నిచ్చారు.గడప గడపకు మ్యానిఫెస్టోను చేర్చే బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులదే అన్నారు.కాంగ్రెస్ హామీలు నీటిమూటలే అని, మ్యానిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేసిన ఘనత దేశంలో బీఆర్ఎస్ పార్టీ ది మాత్రమే అన్నారు.చేసినవి ప్రజలకు చెప్పడానికి బీఆర్ఎస్ కు వంద ఉంటే.. చెప్పుకోవడానికి కాంగ్రెస్ కు ఏమి లేదు అన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లపాటు ఉద్యమించి, కేంద్రంతో కొట్లాడి సాధించుకొన్న తెలంగాణను ఈ పదేండ్లలో సాగు, తాగునీరు, మౌలిక వసతులు, సబ్బండ వర్గాల అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాలు, దేశంలోనే మిన్నగా ఐటీ అభివృద్ధి, రైతుల సర్వతోముఖాభివృద్ధి, మహిళాభ్యున్నతి,గ్రామాలు, పట్టణాల అభివృద్ధి ఇలా ఏ రంగం చూసిన అభివృద్ధిలో ముందుకుపోతున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ అభివృద్ధి పరుగులు ఆగకుండా ఉండాలంటే అందరూ ఆశించిన బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాలంటే ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చి, కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం ఒక్కటే మార్గం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు నీటిమూటలేనని, వారికి మాటలు తప్ప చేతలు తెలియవని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందన్నారు. ఇప్పటికే రైతుబీమా తరహాలో బీమా సౌకర్యం కల్పిస్తుండగా ఇక నుంచి తెల్లరేషన్కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ.5లక్షల బీమా అందిస్తానని ప్రకటించారన్నారు. రూ.400లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు సౌభాగ్యలక్ష్మి కింద రూ.3వేలు, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం, రైతుబంధు రూ.16వేలు, ఆసరా పెన్షన్లు పెంపు వంటి వినూత్న పథకాలు ప్రకటించారని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ పథకాలన్నీ అమలుచేసే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వారి పరిపాలనలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడంలేదంటూ ప్రశ్నించారు. ఇప్పటికే కర్నాటకలో విద్యుత్ సరఫరా లేక రైతులు రోడ్డెక్కుతున్నారని ఆ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఆరోపించారు. దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. పినపాక నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి రేగా కాళికా,సర్పంచ్ పాయం,నరసింహరావు, ఊకే. రామనాథం,మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు పాయం.రాజబాబు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకు,కార్యకర్తలు పాల్గొన్నారు.