మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
40 సంవత్సరాలు సిపిఐ పార్టీలో ఉండి సేవలందించిన ఏఐటీయూసీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
రాష్ట్ర సిపిఐ కమిటీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ శనివారం బిఆర్ఎస్ పార్టీలో వనమా సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా గుత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలో తన రెండు వేల మంది అనుచరులను బీఆర్ఎస్ పార్టీలో చేర్పిస్తానని తెలిపారు.