మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
అత్యంత భద్రత మధ్య ఈవీఎంల లను భద్రపరిచినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
30వ తేదీన జిల్లా పరిధిలోని ఐదు నియొకవర్గాల్లోని 1098 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహించామని చెప్పారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రిసిప్షన్ కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ స్వీకరించామని చెప్పారు. పాల్వంచ మండలం అనుబోస్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో మూడంచల భద్రత మధ్య భద్రపరిచినట్లు చెప్పారు. ఈ నెల మూడో తేదీన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియకు ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పర్యవేక్షణకు 18 టీములు ఏర్పాటు చేశామని ప్రతి టేబుల్ కు ఒక సూక్ష్మ పరిశీలకులు కౌంటింగ్ సూపర్ వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓట్లు లెక్కింపు పరిశీలకులు కమల్ కిషోర్, హరి కిషోర్, గణేష్, భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్, అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ప్రతీక్ జైన్, రాంబాబు, కార్తిక్, శిరీష, మంగిలాల్, ఆర్ అండ్ బి ఈ ఈ భీంలా తదితరులు పాల్గొన్నారు.