మన్యం న్యూస్ మణుగూరు:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ప్రారంభం కానుంది.ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.పర్యవేక్షణకు 18 టీములను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలు పెడతారు.ఈ క్రమంలో స్ట్రాంగ్ రూల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.